Posts

రేపు భీమన అమావాస్య ఈ పండగ ఎలా ఎందుకు జరుపుకోవాలి దాని ఫలితం ఏంటి

Image
 రేపు భీమన అమావాస్య ఈ పండగ ఎలా ఎందుకు జరుపుకోవాలి దాని ఫలితం ఏంటి భీమన అమావాస్య దక్షిణ భారతదేశంలో జరుపుకునే పండుగ , ఎక్కువగా కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులలో.  నూతన వధూవరులు అమావాస్య రోజున జ్యోతిర్భేమేశ్వర వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని భర్త సంజీవిని వ్రతం అని కూడా అంటారు. భీముడి అమావాస్య శివుడిని పూజించే రోజు , తన భర్త దీర్ఘాయువు కోసం కరుణ కోరుతూ ఈ వ్రతం చేస్తారు. భీముడి అమావాస్యను వివాహిత మహిళలు మాత్రమే కాకుండా పెళ్లి కాని అమ్మాయిలు కూడా జరుపుకోవచ్చు. పెళ్లికాని ఆడవారు మంచి భర్తను ప్రసాదించమని దేవుడిని ప్రార్థిస్తారు మరియు వివాహిత స్త్రీ తన భర్త ఆయుష్షు పెరుగుటకు ఈ వ్రతం చేస్తారు.  *ఆరాధన విధానం* గృహిణులు తమ చేతులకు కంకణాలు ధరించి జ్యోతిర్భీమేశ్వరుడిని ధ్యానించాలి. ఉదయం లేదా సాయంత్రం ఏదైనా శుభ సమయంలో వ్రతాన్ని ఆచరించవచ్చు. అన్నం ఒక ప్లేట్ మీద పెట్టి , దానిపై రెండు దీపాలు వేసి , నూనె వెలిగించండి. పూజలతో కూడిన 9 గంటల గౌరీ దారాన్ని పూజించాలి. ముందుగా గణపతిని పూజించి , తర్వాత భీమేశ్వరుని పూజించారు. 9 రకాల నైవేద్యం పెట్టాలి.  ఆ తర్వాత భర్తకు పాదపూజ చేయాలి....

శ్రావణ మాసం విశిష్టత

Image
శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి ,నాగ పంచమి పుత్రాదా ఏకాదశి ,దామోదర ద్వాదశి ,వరాహ జయన్తి ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది. 🌼🌿*శ్రావణ సోమవారం* 🌼🌿 ఈ మాసం లో వచ్చే సోమవారాలలో శివ భక్తులు ఉపవాసాలుంటారు. దీక్...

సాష్టాంగ నమస్కారం...?

Image
 సాష్టాంగ నమస్కారం..... అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటారు.. సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము... ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః... అష్టాంగాలు అంటే... "ఉరసా" అంటే తొడలు, "శిరసా" అంటే తల, "దృష్ట్యా" అనగా కళ్ళు, "మనసా" అనగా హృదయం, "వచసా" అనగా నోరు, "పద్భ్యాం" అనగా పాదములు, "కరాభ్యాం" అనగా చేతులు, "కర్ణాభ్యాం" అంటే చెవులు. ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి. మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి.. ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక వుండి చేయాలి. 1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి. 2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి. 3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు...

తిరుమల శ్రీనివాసుడి అప్పు ఎంత ?

Image
తిరుమల శ్రీనివాసుడి అప్పు ఎంత ?  తిరుమల శ్రీనివాసుని వడ్డికాసులవాడు అని, చేసిన పాపాలను వడ్డీతో సహా స్వీకరిస్తాడని , శ్రీవారు హుండీ ధనాన్ని మొత్తం ఇంకా వడ్డీ రూపంలోనే జమచేస్తున్నాడనీ , ఇంకనూ వడ్డీకూడా తీర్చలేకపోతున్నాడని , కలియుగాంతానికి అసలు వడ్డీతో కలిపి కుబేరునికి ఋణాన్ని తీరుస్తాడనీ మనందరికీ తెలిసిన విషయమే! అసలు శ్రీనివాసుడు కుబేరుని వద్ద తీసుకున్న అపు ఎంత? ఎప్పుడు ? ఎందుకు తీసుకున్నాడు?ఎలా తీరుస్తానన్నాడు? ఇందుకు సాక్ష్యం ఏమైనా ఉందా ? దీని గురించి  భవిష్యోత్తరపురాణం 11 వ అధ్యాయం లో వివరించబడింది. ఋణ గ్రాహీ శ్రీనివాసో ధనదాయీ ధనేశ్వర: ; ఆత్మకార్య నిమిత్తం తు కళ్యాణార్ధం కలౌయుగే ౹  వైశాఖే శుక్లసప్తమ్యాం విలంబే చైవ వత్సరే ౹౹ నిష్కాణాం రామముద్రాణం లక్షాణి చ చతుర్దశ ౹  ద్రవ్యం దత్తం ధనేశేన వృద్ధి గ్రహణ కారణాత్ ౹౹  సవృధ్ధి దిత్సతామూలం స్వీకృతం చక్రపాణి నా ౹ వివాహ వర్షమారభ్య సహస్రాంతే పునః౹౹  దాతవ్యం యక్షరాజాయ శ్రీనివాసేన శార్ఞిణా ౹  ఏకసాక్షీ చతుర్వక్త్రో ద్వితీయస్తు త్రిలోచన:౹౹  తృతీయో౽శ్వత్థరాజాస్తు వేత్తి సర్వమిదం ధృఢం౹ ఇత్యేతదృణపత్రస్తు శ్రీనివాసో...

శఠగోపం వెనక దాగివున్న ర‌హ‌స్యం?

Image
శఠగోపం వెనక దాగివున్న ర‌హ‌స్యం?  శఠగోప్యం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం. శఠగోపం గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక అంటారు పండితులు. గుడికి వెళ్లిన ప్రతి భక్తునికి ఆలయంలో ఉండే దేవతా విగ్రహాలను తాకే వీలుండదు. అందుకే ఆలయ పూజారి భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చిన తర్వాత శఠారిని తీసుకొచ్చి భక్తుల తలపై పెట్టి ఆశీర్వచనం ఇస్తారు.  ఆలయ పూజారి శఠారిని తీసుకువచ్చి భక్తుల తలపై పెట్టడం వలన వారిలో ఉండే చెడు ఆలోచనలు, ద్రోహ బుద్ధులు నశిస్తాయని చెబుతారు. అంతే కాదు శఠగోపం అత్యంత గోప్యమైనది కనుక అది పెట్టే పూజారికి కూడా వినిపించ‌నంతగా కోరికను తలుచుకోవాలని పండితులు చెబుతారు. భ‌గ‌వంతుడి పాదాల చెంత మ‌న కోరిక‌లు.. శఠగోపాన్ని కొన్ని ప్రాంతాలవారు శఠగోపం, శడగోప్యం అని అంటారు. భక్తులు దేవాలయంలో ప్రదక్షిణలు చేసి దర్శనమ‌య్యాక  తీర్థం, శఠగోపం తీసుకుంటారు.  శఠగోపాన్ని పంచలోహాలైన వెండి, రాగి, కంచు మొదలైనవాటితో తయారు చేస్తారు. శఠగోపం వలయాకారంలో ఉంటుంది. వాటిపై భగవంతుని పాదాల గుర్తులు ఉంటాయి. ఇది తలపై పెట్టినప్పుడు పాదాలు మన తలను తాకుతాయి. అలాకాక నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తా...

రాముడిలో ఏమంత… గొప్పదనం ఉంది?

Image
 రాముడిలో ఏమంత… గొప్పదనం ఉంది?                     మాయలు మంత్రాలు చూపించలేదు. విశ్వరూపం ప్రకటించలేదు. *జీవితంలో ఎన్నో కష్టాలు...జరగరాని సంఘటనలు. *చిన్న వయసులోనే పినతల్లి స్వార్థానికి తండ్రిని పోగొట్టుకున్నాడు. *పట్టాభిషేక ముహూర్తానికే అడవుల బాట పట్టాడు... *తోడుగా, ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు... *కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు... *అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే     రాక్షసవధ చేశాడు... *అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు. *లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా తాను మాత్రం విస్పష్టంగా  అహం దశరథాత్మజః - దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే’ అని ప్రకటించాడు… *అయినా లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంది? *ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు. ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ.. ధర్మాన్ని విడిచ...

ఉప్పును చేతితో ఎవ్వరికీ ఇవ్వ కూడదు అలా ఇస్తే ఏమవుతుందో తెలుసా?

Image
ఉప్పును దొంగలించకూడదు ఎందుకు హిందూ సంప్రదాయాల ప్రకారం మనకు అనేక నియమాలు, నిబంధనలు ఉన్నాయి. కొన్ని కొన్ని రోజుల్లో ఇలాంటి పనులు చేయకూడదని.. అలాగే రాత్రి వేళల్లో కొన్నింటిని ఎవ్వరికీ ఇవ్వకూడదని చెప్తుంటారు. అలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న లక్ష్మీ దేవి వేరే వాళ్ల ఇంటికి వెళ్లిపోతుందని మన పెద్దల నమ్మకం. అయితే ఇందులో ఒకటే ఉప్పును దొంగిలించడం. ఉప్పను అస్సలే దొంగిలించకూడదని మన పురాణాలు చెబుతున్నాయి. ఉప్పును దొంగిలిస్తే అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని కూడా అందులో ఉంది. అంతే కాదండోయ్ ఉప్పును దొంగిలించడమే కాదు, కాళ్ళతో తొక్కరాదని... అలాగే చేబదులు కూడా తీసుకో రాదని వవిరంచారు. ఉప్పును చేతితో ఎవ్వరికీ ఇవ్వ కూడదంట కూడా. ఎందుకంటే ఉప్పు శనీశ్వరుని ప్రతి రూపము. పూర్వం ఉప్పు అంతగా దొరికేది కాదు. ఎంతో కష్టం మీద సంపాదించిన ఉప్పును రక్షించు కోవటానికి శనీశ్వరుని అంశగానూ, యమ ధర్మ రాజు ప్రతిరూపం గానూ చెప్పే వారు. అలా చెప్పటం వల్ల ఆ రోజులలో ఉప్పును చేబదులు అడిగేవారు కాదు. దొంగిలించే వారు. కూడా కాదు. కానీ ప్రస్తుతం ఉప్పు చాలా తేలికగానే దొరుకుతుంది. కానీ సాయం కాల సమయాల్లో మన ఇంట్లో ఉప్పు అయిపోతే దుకాణాల్లో అమ్మ...