ఉప్పును చేతితో ఎవ్వరికీ ఇవ్వ కూడదు అలా ఇస్తే ఏమవుతుందో తెలుసా?

ఉప్పును దొంగలించకూడదు ఎందుకు




హిందూ సంప్రదాయాల ప్రకారం మనకు అనేక నియమాలు, నిబంధనలు ఉన్నాయి. కొన్ని కొన్ని రోజుల్లో ఇలాంటి పనులు చేయకూడదని.. అలాగే రాత్రి వేళల్లో కొన్నింటిని ఎవ్వరికీ ఇవ్వకూడదని చెప్తుంటారు.


అలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న లక్ష్మీ దేవి వేరే వాళ్ల ఇంటికి వెళ్లిపోతుందని మన పెద్దల నమ్మకం. అయితే ఇందులో ఒకటే ఉప్పును దొంగిలించడం. ఉప్పను అస్సలే దొంగిలించకూడదని మన పురాణాలు చెబుతున్నాయి. ఉప్పును దొంగిలిస్తే అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని కూడా అందులో ఉంది. అంతే కాదండోయ్ ఉప్పును దొంగిలించడమే కాదు, కాళ్ళతో తొక్కరాదని... అలాగే చేబదులు కూడా తీసుకో రాదని వవిరంచారు.


ఉప్పును చేతితో ఎవ్వరికీ ఇవ్వ కూడదంట కూడా. ఎందుకంటే ఉప్పు శనీశ్వరుని ప్రతి రూపము. పూర్వం ఉప్పు అంతగా దొరికేది కాదు. ఎంతో కష్టం మీద సంపాదించిన ఉప్పును రక్షించు కోవటానికి శనీశ్వరుని అంశగానూ, యమ ధర్మ రాజు ప్రతిరూపం గానూ చెప్పే వారు. అలా చెప్పటం వల్ల ఆ రోజులలో ఉప్పును చేబదులు అడిగేవారు కాదు. దొంగిలించే వారు. కూడా కాదు. కానీ ప్రస్తుతం ఉప్పు చాలా తేలికగానే దొరుకుతుంది. కానీ సాయం కాల సమయాల్లో మన ఇంట్లో ఉప్పు అయిపోతే దుకాణాల్లో అమ్మరు. అలాగే ఎవరూ చేబదులు కూడా ఇవ్వరు. రోజులు గడుస్తున్నా మనం మాత్రం మన నియమ, నిబంధనలను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాం. ఉలాగే ఉప్పుతో పాటు పసుపు, నూనెలను కూడా రాత్రి వేళల్లో ఎవరూ అమ్మరు, అలాగే చేబదులు కూడా ఇవ్వరు.



Comments

Popular posts from this blog

ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?

తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా? గాయత్రి దేవి అంటే ఎవరు..?

లక్ష్మీ కటాక్షం లభించాలంటే ఇలా చేయండి