Posts

Showing posts from June, 2022

శఠగోపం వెనక దాగివున్న ర‌హ‌స్యం?

Image
శఠగోపం వెనక దాగివున్న ర‌హ‌స్యం?  శఠగోప్యం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం. శఠగోపం గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక అంటారు పండితులు. గుడికి వెళ్లిన ప్రతి భక్తునికి ఆలయంలో ఉండే దేవతా విగ్రహాలను తాకే వీలుండదు. అందుకే ఆలయ పూజారి భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చిన తర్వాత శఠారిని తీసుకొచ్చి భక్తుల తలపై పెట్టి ఆశీర్వచనం ఇస్తారు.  ఆలయ పూజారి శఠారిని తీసుకువచ్చి భక్తుల తలపై పెట్టడం వలన వారిలో ఉండే చెడు ఆలోచనలు, ద్రోహ బుద్ధులు నశిస్తాయని చెబుతారు. అంతే కాదు శఠగోపం అత్యంత గోప్యమైనది కనుక అది పెట్టే పూజారికి కూడా వినిపించ‌నంతగా కోరికను తలుచుకోవాలని పండితులు చెబుతారు. భ‌గ‌వంతుడి పాదాల చెంత మ‌న కోరిక‌లు.. శఠగోపాన్ని కొన్ని ప్రాంతాలవారు శఠగోపం, శడగోప్యం అని అంటారు. భక్తులు దేవాలయంలో ప్రదక్షిణలు చేసి దర్శనమ‌య్యాక  తీర్థం, శఠగోపం తీసుకుంటారు.  శఠగోపాన్ని పంచలోహాలైన వెండి, రాగి, కంచు మొదలైనవాటితో తయారు చేస్తారు. శఠగోపం వలయాకారంలో ఉంటుంది. వాటిపై భగవంతుని పాదాల గుర్తులు ఉంటాయి. ఇది తలపై పెట్టినప్పుడు పాదాలు మన తలను తాకుతాయి. అలాకాక నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తా...

రాముడిలో ఏమంత… గొప్పదనం ఉంది?

Image
 రాముడిలో ఏమంత… గొప్పదనం ఉంది?                     మాయలు మంత్రాలు చూపించలేదు. విశ్వరూపం ప్రకటించలేదు. *జీవితంలో ఎన్నో కష్టాలు...జరగరాని సంఘటనలు. *చిన్న వయసులోనే పినతల్లి స్వార్థానికి తండ్రిని పోగొట్టుకున్నాడు. *పట్టాభిషేక ముహూర్తానికే అడవుల బాట పట్టాడు... *తోడుగా, ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు... *కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు... *అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే     రాక్షసవధ చేశాడు... *అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు. *లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా తాను మాత్రం విస్పష్టంగా  అహం దశరథాత్మజః - దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే’ అని ప్రకటించాడు… *అయినా లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంది? *ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు. ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ.. ధర్మాన్ని విడిచ...

ఉప్పును చేతితో ఎవ్వరికీ ఇవ్వ కూడదు అలా ఇస్తే ఏమవుతుందో తెలుసా?

Image
ఉప్పును దొంగలించకూడదు ఎందుకు హిందూ సంప్రదాయాల ప్రకారం మనకు అనేక నియమాలు, నిబంధనలు ఉన్నాయి. కొన్ని కొన్ని రోజుల్లో ఇలాంటి పనులు చేయకూడదని.. అలాగే రాత్రి వేళల్లో కొన్నింటిని ఎవ్వరికీ ఇవ్వకూడదని చెప్తుంటారు. అలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న లక్ష్మీ దేవి వేరే వాళ్ల ఇంటికి వెళ్లిపోతుందని మన పెద్దల నమ్మకం. అయితే ఇందులో ఒకటే ఉప్పును దొంగిలించడం. ఉప్పను అస్సలే దొంగిలించకూడదని మన పురాణాలు చెబుతున్నాయి. ఉప్పును దొంగిలిస్తే అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని కూడా అందులో ఉంది. అంతే కాదండోయ్ ఉప్పును దొంగిలించడమే కాదు, కాళ్ళతో తొక్కరాదని... అలాగే చేబదులు కూడా తీసుకో రాదని వవిరంచారు. ఉప్పును చేతితో ఎవ్వరికీ ఇవ్వ కూడదంట కూడా. ఎందుకంటే ఉప్పు శనీశ్వరుని ప్రతి రూపము. పూర్వం ఉప్పు అంతగా దొరికేది కాదు. ఎంతో కష్టం మీద సంపాదించిన ఉప్పును రక్షించు కోవటానికి శనీశ్వరుని అంశగానూ, యమ ధర్మ రాజు ప్రతిరూపం గానూ చెప్పే వారు. అలా చెప్పటం వల్ల ఆ రోజులలో ఉప్పును చేబదులు అడిగేవారు కాదు. దొంగిలించే వారు. కూడా కాదు. కానీ ప్రస్తుతం ఉప్పు చాలా తేలికగానే దొరుకుతుంది. కానీ సాయం కాల సమయాల్లో మన ఇంట్లో ఉప్పు అయిపోతే దుకాణాల్లో అమ్మ...

అరుంధతి మహా పతివ్రత నక్షత్రంగా ఎందుకు మారింది?

Image
         అరుంధతి నక్షత్రం..కథ          హిందూ సంప్రదాయం ప్రకారం వివాహఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని చూస్తారు. అయితే చాలా మందికి అరుంధతి నక్షత్రం గురించి అస్సలు తెలియదు. దాని నేపథ్యం ఏమిటనే విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు. పవిత్రత అనే పదానికి పర్యాయరూపమే అరుంధతి. పతివ్రతల్లో ఈమె మొదటిస్థానంలో ఉంటారు.అందుకే నింగిలో చుక్కలా నిలిచిపోయింది. ఈమె ఎంతో అందగత్తె. మహాపతివ్రత. ఇసుకను అన్నంగా తయారు చెయ్యగలరా..? అరుంధతి గురించి చాలా కథలున్నాయి. అందులో కొన్ని…వశిష్ట మహర్షి గురించి వినే ఉంటారు. ఆయన పెళ్లి చేసుకోవాలని అంతటా తిరుగుతూ ఉంటాడు…. ఒకసారి ఒక గ్రామంలో కన్నెలంతా అతన్ని చూడడానికి వచ్చారు. వశిష్టుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు. “ఈ ఇసుకను ఎవరైనా సరే వండి అన్నంగా తయారు చెయ్యగలరా?” అని అడిగాడు.అయితే ఆ గ్రామంలోని అమ్మాయిల్లో ఎవ్వరూ అది సాధ్యం కాదని చెప్పారు.*పక్క గ్రామమైన మాల పల్లె నుంచి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలబడుతుంది. నేను చేస్తానండి” అని అంటుంది. వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టింది. ఎసరు బాగా మరిగిన తర్వాత అం...

జ్యోతిర్లింగాలను దర్శిస్తే వచ్చే ఫలితాలు ఏమిటి

Image
 జ్యోతిర్లింగాలను దర్శిస్తే వచ్చే ఫలితాలు ఏమిటి    హిందువు శివున్ని మూర్తి రూపంలో, లింగ రూపంలోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైందిగా భావిస్తారు. ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని భక్తుల నమ్మకం.     అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యం అయినవిగా అనాది నుండి భావిస్తున్నారు. అయితే ఈ జ్యోతిర్లింగాలను దర్శించిన, జ్యోతిర్లింగాల స్త్రోత్రాన్ని నిత్యం పఠించిన వారికి ఏడేడు జన్మలలో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల నమ్మకం.     సౌరాష్ట్ర సోమ నాథుడ్ని దర్శించిన భోగ భాగ్యాలు కలుగుతాయి. శ్రీశైల మల్లికార్జునుడ్ని సేవించిన సర్వ దరిద్రాలు సమిసిపోతాయి. ఉజ్జయిని మహా కాలుడ్ని కొలిచిన సర్వ భయ పాపాలూ హరించుకు పోతాయి. ఓం కారేశ్వరము అమర లింగేశ్వరుడు, ఇహ పరాలూ, సౌఖ్యానిస్తాడు. పరళి వైద్య నాథ లింగాన్ని సేవించిన అనేక దీర్ఘ వ్యాధుల నయమవుతాయి. భీమేశ్వ రము భీమేశ్వర లింగాన్ని దర్శించిన శతృ జయం కలిగి అకాల మృత్యు భయాలు తొలగి పోతాయి.    రామేశ్వరము రామేశ్వర లింగాన్ని దర్శించి, కాశీలో గంగా జలాన్ని అభి...

వెంకన్నను దర్శించుకున్నాక.. శ్రీ కాళహస్తికి ఎందుకు వెళ్ళాలో తెలుసా?

Image
వెంకన్నను దర్శించుకున్నాక.. శ్రీ కాళహస్తికి ఎందుకు వెళ్ళాలో తెలుసా? శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వెళ్లే భక్తులు దర్శనం అనంతరం తిరుమల దగ్గర్లో ఉన్న అన్ని దేవాలయాలు దర్శించుకుంటారు. పాపవినాశనం, కాణిపాకంతో పాటు చివరిగా శ్రీకాళహస్తిని దర్శించుకోవడం సాధారణం. శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న తర్వాత మరే దేవాలయానికి వెళ్లకూడదని చెబుతారు.    ఒకవేళ వెళితే అరిష్టం అనే ఆచారం హిందు సాంప్రదాయాలలో అనాది నుండి వస్తోంది. అసలు ఎందుకు అలా చేయాలి, కాళహస్తీశ్వరుడిని దర్శించుకోవడంలో ఆంతర్యం ఏమిటి, ఆ ఆలయానికి వెళ్లిన తర్వాత మరే గుడికి ఎందుకు వెళ్లకూడదు. ఇలాంటి సందేహాలు రావడం అందరికీ సహజం. ఈ విశ్వం పంచభూతాల నిలయం.  పంచభూతాలు అంటే గాలి, నింగి, నేల, నీరు, నిప్పు. వీటికి ప్రతితగా భూమి మీద పంచభూతలింగాలు వెలశాయి. అందులో ఒకటి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసిన వాయులింగం. అయితే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇతర దేవాలయాలకు వెళ్లకూడదు అనే ఆచారం ఉంది. అందులో నిజం లేకపోలేదు. సర్పదోషం, రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా నయమవుతుంది.    శ్రీక...