Posts

అరుంధతి మహా పతివ్రత నక్షత్రంగా ఎందుకు మారింది?

Image
         అరుంధతి నక్షత్రం..కథ          హిందూ సంప్రదాయం ప్రకారం వివాహఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని చూస్తారు. అయితే చాలా మందికి అరుంధతి నక్షత్రం గురించి అస్సలు తెలియదు. దాని నేపథ్యం ఏమిటనే విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు. పవిత్రత అనే పదానికి పర్యాయరూపమే అరుంధతి. పతివ్రతల్లో ఈమె మొదటిస్థానంలో ఉంటారు.అందుకే నింగిలో చుక్కలా నిలిచిపోయింది. ఈమె ఎంతో అందగత్తె. మహాపతివ్రత. ఇసుకను అన్నంగా తయారు చెయ్యగలరా..? అరుంధతి గురించి చాలా కథలున్నాయి. అందులో కొన్ని…వశిష్ట మహర్షి గురించి వినే ఉంటారు. ఆయన పెళ్లి చేసుకోవాలని అంతటా తిరుగుతూ ఉంటాడు…. ఒకసారి ఒక గ్రామంలో కన్నెలంతా అతన్ని చూడడానికి వచ్చారు. వశిష్టుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు. “ఈ ఇసుకను ఎవరైనా సరే వండి అన్నంగా తయారు చెయ్యగలరా?” అని అడిగాడు.అయితే ఆ గ్రామంలోని అమ్మాయిల్లో ఎవ్వరూ అది సాధ్యం కాదని చెప్పారు.*పక్క గ్రామమైన మాల పల్లె నుంచి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలబడుతుంది. నేను చేస్తానండి” అని అంటుంది. వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టింది. ఎసరు బాగా మరిగిన తర్వాత అం...

జ్యోతిర్లింగాలను దర్శిస్తే వచ్చే ఫలితాలు ఏమిటి

Image
 జ్యోతిర్లింగాలను దర్శిస్తే వచ్చే ఫలితాలు ఏమిటి    హిందువు శివున్ని మూర్తి రూపంలో, లింగ రూపంలోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైందిగా భావిస్తారు. ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని భక్తుల నమ్మకం.     అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యం అయినవిగా అనాది నుండి భావిస్తున్నారు. అయితే ఈ జ్యోతిర్లింగాలను దర్శించిన, జ్యోతిర్లింగాల స్త్రోత్రాన్ని నిత్యం పఠించిన వారికి ఏడేడు జన్మలలో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల నమ్మకం.     సౌరాష్ట్ర సోమ నాథుడ్ని దర్శించిన భోగ భాగ్యాలు కలుగుతాయి. శ్రీశైల మల్లికార్జునుడ్ని సేవించిన సర్వ దరిద్రాలు సమిసిపోతాయి. ఉజ్జయిని మహా కాలుడ్ని కొలిచిన సర్వ భయ పాపాలూ హరించుకు పోతాయి. ఓం కారేశ్వరము అమర లింగేశ్వరుడు, ఇహ పరాలూ, సౌఖ్యానిస్తాడు. పరళి వైద్య నాథ లింగాన్ని సేవించిన అనేక దీర్ఘ వ్యాధుల నయమవుతాయి. భీమేశ్వ రము భీమేశ్వర లింగాన్ని దర్శించిన శతృ జయం కలిగి అకాల మృత్యు భయాలు తొలగి పోతాయి.    రామేశ్వరము రామేశ్వర లింగాన్ని దర్శించి, కాశీలో గంగా జలాన్ని అభి...

వెంకన్నను దర్శించుకున్నాక.. శ్రీ కాళహస్తికి ఎందుకు వెళ్ళాలో తెలుసా?

Image
వెంకన్నను దర్శించుకున్నాక.. శ్రీ కాళహస్తికి ఎందుకు వెళ్ళాలో తెలుసా? శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వెళ్లే భక్తులు దర్శనం అనంతరం తిరుమల దగ్గర్లో ఉన్న అన్ని దేవాలయాలు దర్శించుకుంటారు. పాపవినాశనం, కాణిపాకంతో పాటు చివరిగా శ్రీకాళహస్తిని దర్శించుకోవడం సాధారణం. శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న తర్వాత మరే దేవాలయానికి వెళ్లకూడదని చెబుతారు.    ఒకవేళ వెళితే అరిష్టం అనే ఆచారం హిందు సాంప్రదాయాలలో అనాది నుండి వస్తోంది. అసలు ఎందుకు అలా చేయాలి, కాళహస్తీశ్వరుడిని దర్శించుకోవడంలో ఆంతర్యం ఏమిటి, ఆ ఆలయానికి వెళ్లిన తర్వాత మరే గుడికి ఎందుకు వెళ్లకూడదు. ఇలాంటి సందేహాలు రావడం అందరికీ సహజం. ఈ విశ్వం పంచభూతాల నిలయం.  పంచభూతాలు అంటే గాలి, నింగి, నేల, నీరు, నిప్పు. వీటికి ప్రతితగా భూమి మీద పంచభూతలింగాలు వెలశాయి. అందులో ఒకటి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసిన వాయులింగం. అయితే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇతర దేవాలయాలకు వెళ్లకూడదు అనే ఆచారం ఉంది. అందులో నిజం లేకపోలేదు. సర్పదోషం, రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా నయమవుతుంది.    శ్రీక...

ఈ మంత్రం పోయినవాటిని తిరిగి తెస్తుంది

Image
     ఈ మంత్రం పోయినవాటిని తిరిగి తెస్తుంది                 ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా, ఇంట్లో ఎవరైనా చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయినా,    భార్యా భర్తల మధ్య మనశ్శాంతి కరువయినా ఒకేఒక మంత్రం *’నిరంతరం’* స్మరిస్తూ ఉంటే పోయినవన్నీ తిరిగి లభిస్తాయి. *ఇంతకీ ఏమిటా మంత్రమని ఆలోచిస్తున్నారా? అదే కార్తవీర్యార్జున మంత్రం.* స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్పూర్తిగా స్మరిస్తే  పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి.  డబ్బైనా, మనశ్శాంతి అయినా లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళయినా  ‘మొత్తానికి సమస్య ఏదైనా’ పరిష్కారం తప్పకుండా లభిస్తుందని చెపుతున్నారు మన పండితులు. *ఆ మంత్రం ఈ విధం ఉంటుంది:* *ఓం కార్తవీర్యార్జునో నమః రాజ బాహు సహస్రవాన్*  *తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే* ఈ కార్తవీర్యార్జునుడు ఎవరూ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం యొక్క అంశ. స్వామి సుదర్శనుని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు. కాని భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులు ఉండవు. చేతులు లేకుండా పుట్టిన ఇతను దత్తా...

ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీ దేవి ప్రవాహాన్ని ఎవరు ఆపలేరు

Image
   *గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపం* గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి. శంఖాలకు ఏవిధమైన ప్రాధాన్యత ఉందో  గవ్వలకు అదేవిధమైన ప్రాధాన్యత ఉంది. గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు.  దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది.  గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు.  గవ్వలు లక్ష్మీ దేవి చెల్లెల్లు అని,  శంఖాలను లక్ష్మీదేవి సోదరులనీ భావిస్తుంటారు.  గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి కూడా  ప్రత్యక్ష సంబందం ఉంది.  శివునికి చేసే అష్టాదశ అలంకరణలో  గవ్వలుకూడ ఉంటాయి.  శివుని జటాజూటంలోను,  శివుని వాహనమైన నందీశ్వరుని మెడలోనూ గవ్వలే అందంగా ఉంటాయి.  గవ్వలు అలంకరణ వస్తువుగాను, ఆటవస్తువుగాను, తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుంది.  పంచతంత్రంలో ఒక చోట "చేత గవ్వలు లేనట్లయితే స్నేహితుడే శత్రువు అవుతాడు." అని ఉంది.  కాబట్టి గవ్వలకి ఆధ్యాత్మిక, సాంస్కృతిక,  ఆర్ధిక జీవనంతో సంబందాలు ఉన్నాయి అనేది వాస్తవం. 1) పిల్లలకి దృష్టిదోష నివారణకు గవ్వలను  వారి మెడలోగాని,మొలతాడులోగా...

నర్మదా నది ప్రతి రాయిలో శివుడు ఉన్నాడు, ఎందుకు?*

Image
నర్మదా నది ప్రతి రాయిలో శివుడు ఉన్నాడు, ఎందుకు?   నర్మదేశ్వర్ శివలింగానికి సంబంధించి ఒక మతపరమైన కథ ఉంది - గంగా, యమునా, నర్మద మరియు సరస్వతి భారతదేశంలోని నాలుగు ఉత్తమ నదులు.  వాటిలో కూడా గంగానదికి సమాంతరంగా ఈ భూమి మీద నది లేదు.  పూర్వకాలంలో నర్మదా నది చాలా సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను సంతోషపెట్టింది.  సంతోషించిన బ్రహ్మ అతనిని వరం అడగమని అడిగాడు.  అప్పుడు నర్మదాజీ ఇలా అన్నారు - 'బ్రహ్మా!  నీవు నా పట్ల ప్రసన్నుడైతే నన్ను గంగాజీలా చేయి, కాశీపురికి మరే ఇతర నగరమైనా సాటి రాగలిగితే, మరే ఇతర నది కూడా గంగానదిలా ఉంటుంది.  బ్రహ్మదేవుని మాటలు విన్న నర్మద తన వరాన్ని త్యజించి కాశీకి వెళ్లి అక్కడ పిపిలతీర్థంలో శివలింగాన్ని స్థాపించి తపస్సు చేయడం ప్రారంభించింది.  శంకర భగవానుడు వారిని చూసి చాలా సంతోషించి వరం కోరమని అడిగాడు.  అప్పుడు నర్మద చెప్పింది - 'ప్రభూ!  పనికిమాలిన వరం అడగడం వల్ల ప్రయోజనం ఏమిటి?  నా భక్తిని నీ పాద పద్మముల వద్ద ఉంచుము.  నర్మదా మాటలు విని శంకరుడు చాలా సంతోషించి ఇలా అన్నాడు - 'నర్మదే!  నీ ఒడ్డున ఉన్న బండరాళ్లన్నీ నా పెం...

కృష్ణార్పణం అనడానికి కారణమేమిటి.? అంటే ఫలితమేమిటి?

Image
కృష్ణార్పణం అనడానికి కారణమేమిటి.? అంటే ఫలితమేమిటి? ఏదో ఒక కర్మ చెయ్యకుండా ఏ ప్రాణీ ఉండలేదు. మంచి పనులు చేస్తే కీర్తి, ప్రతిష్టలు, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు వస్తాయి.  చెడ్డపనులు చేస్తే సంఘంలో చెడ్డపేరు, నరకయాతనలు, పాపఫలాలు వస్తాయి. ఇలా పాపపుణ్యాలు చేస్తూ, స్వర్గనరకాలనుభవిస్తూ, మరల మరల జన్మలెత్తుతూ ఈ జన్మ మరణ సంసార చక్రంలో  ఉండిపోవలసిందేనా?  లేక మోక్షం పొందడం ఉందా? అని మనం విచారించడం సహజం. మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికే  గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు.  అర్జునా! నువ్వేపని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, ఎవరికి ఏదిచ్చినా, ఏ తపం చేసినా అదంతా నాకు సమర్పించు అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి? ఇలా చేస్తే, మనం మూడు త్యాగాలు చేసినట్లవుతుంది.  మొదటిది కర్తృత్వ త్యాగం. ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి. ఏ కర్మయినా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవత్పరంగా చెయ్యాలి. ఇలా చేస్తే, మనం పాపపు పనులు చేయడానికి జంకుతాము. కర్మసాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కార్యాలకు పూనుకుంటాము. రెండోది ఫలత్యాగం...