Posts

Showing posts from April, 2022

బిక్షగాడు మీ ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అన్నప్పుడు మీకు ఒక హెచ్చరిక

Image
బిక్షగాడు మీ ఇంటి ముందు నిలబడి, “భవతీ భిక్షాం దేహి” అన్నప్పుడు మీకు ఒక హెచ్చరిక చేస్తున్నాడని గ్రహించాలి. “నేను పూర్వజన్మలో బిక్షగానికి అన్నం పెట్టలేదు. బిక్షగానిని నా పుత్రునిగా భావించలేదు. కనుకనే, నేను ఈనాడు బిక్షగానిగా పుట్టాను. మీరు వచ్చే జన్మలో నావలె బిక్షగాళ్ళు కాకండి” అని హెచ్చరిస్తున్నాడని గుర్తించాలి. ఐతే, తాను బిక్షం ఎవరిని అడుగుతున్నాడు? “బిక్షాం దేహి” అంటున్నాడు. 'దేహి' అనేది దైవం యొక్క పేరే. తాను దైవాన్ని బిక్షమడుగుతున్నాడు. అందరూ దైవాన్ని బిక్షమడుగవలసిందే! ధనము, విద్య, వివేకము మొదలైన వాటిని మీకు ఇచ్చేవాడు దైవమే! కనుక, మీరు దైవం నుండి పొందినవాటిని ఇంకొకరికి కూడా అందించాలి. మీరు పొందిన విద్యను ఇతరులకు బోధించాలి. మీరు సంపాదించిన ధనమును దానం చేయాలి. అప్పుడే విద్యగాని, ధనముగాని మీవద్ద శాశ్వతంగా నిలుస్తాయి. “త్యాగేనైకే అమృతత్వ మానశుః” త్యాగమే అమృతత్వాన్ని చేకూర్చుతుంది."🙏

రహస్యమైన నాగ దేవాలయం

Image
        రహస్యమైన నాగ దేవాలయం    బెంగుళూరు నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఉన్న ఏకైక మరియు అరుదైన నాగదేవత ఆలయం. నలుమూలల నుండి జనాలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు మరియు నాగ దోషాలను నివారించడానికి నాగ బొమ్మలను ప్రతిష్టిస్తారు.             విదురాశ్వత దేవస్థానం, హలగనహళ్లి, గౌరీబిదనూరు,  చిక్కబల్లాపూర్ జిల్లా, కర్ణాటక, భారతదేశం సర్ప్ ధోష్ ఉన్న చాలా మంది సంతానం లేని జంటలు సర్ప రాతి చిహ్నాన్ని పాములు  సంతానోత్పత్తికి చిహ్నాలుగా ప్రార్థిస్తారు మరియు వారికి సంతానం కలిగిన తర్వాత, వారు కృతజ్ఞతా చిహ్నంగా ఆలయంలో పాము యొక్క రాతి చిహ్నాన్ని ఉంచుతారు.      కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగిన యుద్ధంలో చాలా విధ్వంసం చూసిన విదురుడు దీనిని నిర్మించాడని నమ్ముతారు, కాబట్టి శ్రీ కృష్ణుడు అతనికి తీర్ధం చేయమని సలహా ఇచ్చాడు. అతను ఇక్కడ స్థిరపడి, ఇప్పటికీ ఇక్కడ కనిపించే ఒక అశ్వత్థను నాటాడు.

28-04-2022- ఉజ్జయిని నుండి ఉదయం ప్రత్యక్ష దర్శనం

Image
                     జై మహాకాళేశ్వర్ జీ🙏

ఇక్కడి నరసింహస్వామి పానకాన్ని గుటక వేస్తూ తాగుతాడు

Image
  లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, మంగళగిరి   ఇటు నరుడు కాకుండా .. అటు జంతువు కాకుండా ఇద్దరి రూపాల కలయికతో భక్త సంరక్షుణ కోసం విష్ణువు చేసిన అద్భుత అవతారం నారసింహ. కోరి కొలిచిన వారి పాలిట కొంగు బంగారం నరసింహ స్వామి గా భక్తులతో కీర్తించబడుతున్నాడు. భక్తులు వేడుకున్న వెంటనే కాపాడే దయగల దేవుడు నరసింహస్వామి. అందుకనే శ్రీ శంకరాచార్యులంతటివారు తనని ఆపదలనుండి రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ కరావలంబన స్తోత్రం చేశారు. అంతటి దయామయుడైన ఆ స్వామి కృష్ణానదీ తీరాన గుంటూరు జిల్లా మంగళగిరిలో వెలసిన స్వామిని పానకాల నరసింహ స్వామిగా భక్తులు పూజిస్తారు. *శ్రీ పానకాల నరసింహ క్షేత్ర స్ధలపురాణం* మంగళగిరిలో మూడు నరసింహస్వామి ఆలయాలున్నాయి. కొండ దిగువన వున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొండపైన వున్న పానకాల స్వామి ఆలయం, కొండ శిఖరం మీద వున్న గండాల నరసింహస్వామి ఆలయం. కొండ దిగువన వున్న ఆలయంలో శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామిని భక్తులు దర్శించుకోగలరు. హిరణ్యకశిపుని వధించిన అనంతరం శ్రీ నరసింహస్వామి భయంకర రూపంతో, రౌద్రంగా, అందరికీ భీతికొల్పుతూ వున్నారు. దేవతలంతా ఆ దేవదేవుని శాంతించమని ప్రార్ధించినా ఫలితం ...

వీటిని అవమానిస్తే చావుకు దగ్గరైనట్లే!

Image
                                వీటిని అవమానిస్తే చావుకు దగ్గరైనట్లే!     అష్టాదశ పురాణాల్లో ఒకటి భాగవత పురాణం. దీన్ని శ్రీమద్భాగవత మహా పురాణం అంటారు. అలాగే భాగవతం అని కూడా పిలుస్తారు.      హిందువులకు ఇది గొప్ప గ్రంథం. మొదట సంస్కృతంలో రచించిన ఈ గ్రంథం ప్రస్తుతం అన్ని భారతీయ భాషల్లోనూ లభ్యమవుతుంది. కృష్ణ తత్వాన్ని గురించి భాగవతం తెలియజేస్తుంది. ఆది శంకరుల అద్వైత్వం దీనిలో మిళితమై ఉంది. ఇతర పురాణాల్లో కంటే భాగవత పురాణంలో వంశవృక్షం, పురాణాలు, భూగోళ శాస్త్రం, విశ్వోద్భవ శాస్త్రం, నృత్యం, సంగీతం, యోగా, సంస్కృతి లాంటి అనేక విషయాలను విస్తృతం గా చర్చించారు. రాక్షసుల అలజడులు, దేవాసుర యుద్ధాలు, విశ్వాన్ని నాశనం చేయడానికి అసురుల ప్రయత్నాలను శ్రీహరి ఎలా అడ్డుకున్నారో పేర్కొన్నారు. వారి నుంచి లోకాన్ని రక్షించి శాంతి, సౌభాగ్యాలను నెలకొల్పాడు.             విష్ణువును ఆరాధించేవారిని వైష్ణువులుగా పేర్కొంటారు. శ్రీమహా విష్ణువును ఆరాధించేవారికి మోక్షం సిద్ధిస్తుందని నమ్ముతా...

ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉండవలసిన చిత్ర పటము

Image
        ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉండవలసిన  చిత్ర పటము  శ్రీ దక్షిణామూర్తి చిత్రం                           ఇంట్లో ఒక్క దక్షిణామూర్తి చిత్ర పటము పెట్టి, ప్రతీ రోజూ 10 నిమిషాలు ఆయన ముందు కూర్చుని, ఆయన స్తోత్రమును కానీ, మంత్రమును కానీ చేస్తే వచ్చే ఫలితము ఇంత అని చెప్పలేము.     అపమృత్యువు తొలగిపోతుంది, మేధా శక్తి పెంపొందుతుంది, ధారణ, స్పష్టత కలుగుతాయి. కేవలము విద్యార్ధులకు మాత్రమే కాదు, అన్ని వయసుల వారికీ ఇది వర్తిస్తుంది.   మంచి ఆలోచనలు కలుగుతాయి, సత్వ గుణం వృద్ధి చెందుతుంది, ప్రారబ్ధ కర్మలు, దుష్కర్మల ఫలితం క్షీణిస్తుంది, ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి.     ఇది ఎంతో మంది జీవితాలలో జరిగింది. మీకోసం దక్షిణామూర్తి మంత్రమును, దక్షిణామూర్తి స్తోత్రమును పెడుతున్నాము.       స్తోత్రము లేదా మంత్రము కూడా చదవలేని వారు ఉంటే, కేవలము                  శ్రీ దక్షిణామూర్తి చిత్రపటాన్ని అలా చూస్తూ కూర్చున్నా విశేష ఫలితము ఉం...

రామాయణంలో రాముడు ఎక్కడా మహిమలు చూపలేదు! ఎందుకు?

Image
   రామాయణంలో రాముడు ఎక్కడా మహిమలు చూపలేదు. ఒక మాములు వ్యక్తిగా పుట్టిన వ్యక్తి దాదాపు 10,00,000 నుంచి 18,00,000 సమవత్సరాలు గడిచిపోయినా, ఇంకా అదే వైభవంతో వెలగడానికి కారణం రాముడి సత్యనిష్ట, ధర్మ నిబద్ధత.      రాముడు తన బాణాలతో 14,000 మంది కరదూషణాదులను చంపాడు కానీ తనకు అమోఘమైన శక్తి ఉన్నదని గర్వించలేదు. వాలి ప్రపంచంలో ఉన్న వానరసైన్యాన్ని ఏక తాటిపైకి తీసుకువచ్చి, సమన్వయ పరిచాడు. వాలి ఎంత శక్తివంతుడంటే, వాలికి రావణాసురుడు కూడా భయపడ్డాడు. అటువంటి వాలితో స్నేహం చేస్తే, సీతమ్మను క్షణంలో లంక నుంచి తీసుకురావచ్చని తెలిసినా, వాలి తన ధర్మం తప్పాడని అతని సాయం కోరలేదు. వాలిని చూసి భయపడుతున్న సుగ్రీవునికి అండగా నిలబడ్డడు. వాలిని చంపి, రాజ్యాన్ని సుగ్రీవుడికి అప్పజెప్పాడు కానీ తాను రాజ్యంలో కొద్ది భాగం కూడా తీసుకోలేదు.    శత్రువు తమ్ముడైనా, తనను శరణు వేడుకున్నాడని విభీషణుడికి గౌరవం ఇచ్చాడు, స్నేహం కుదిరిని వెంటనే విభీషణునికి లంకాధిపతిగా సముద్రజలాలతో పట్టాభిషేకం చేశాడు శ్రీ రాముడు. అప్పుడు అక్కడున్న వారికి ఒక ప్రశ్న తలెత్తింది. విభీషణుడు శరణుజొచ్చాడని అతనికి పట్టాభిషేకం...

మంగళవారం చేయవలసిన, చేయకూడని పనులు

Image
        *చేయవలసిన, చేయకూడని పనులు*      మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు ధరత్రీ పుత్రుడు, భూమిపై నివసించేవారికి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.      కుజుడు ప్రమాదాలకు, కలహాలకు, నష్టాలకు కారకుడు. అందుకనే సాధారణంగా కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు… శుభకార్యాలు తలపెట్టరు.      *మంగళవారం చెయకూడని పనులు.* 1.మంగళవారం గోళ్ళు కత్తిరించడం, క్షవరం అలాంటివి చేయకూడదు. 2.మంగళవారం అప్పు ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ రావడం చాలా కష్టం. ౩.అప్పు తీసుకుంటే అది అనేక బాధలకు, అనవసరమైన పనులకు ఖర్చు అయిపోయి, తీరకపోయే ప్రమాదం ఉంది. 4.మంగళవారం కొత్త బట్టలు వేసుకోకూడదు. 5.మంగళవారం అత్యవసరం అయితే తప్ప మంగళవారం ప్రయాణాలు పెట్టుకోకూడదు. 6.మంగళవారం ఉపవాసం చేసిన వారు రాత్రి ఉప్పు వేసిన పదార్ధాలు తినకూడదు. 7.మంగళవారం తలంటు స్నానం చేయకూడదు. 8.దైవకార్యాలకు, విద్యా వైద్య రుణాలు ఎప్పుడైనా ఇవ్వవచ్చు. *మంగళవారం చేయవలసిన పనులు.* 1.మంగళవారం ఆంజనేయుడిని ద్యానించడం వలన ధైర్యం చేకూరి, అన్ని పనులు అవుతాయి. 2.సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయడం వలన కుజగ్రహ ప్రభావం వలన కలిగే ప్రమాదాలన...

తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రతిపాదించిన రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ

Image
 తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రతిపాదించిన రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ.  తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారు,వర్కింగ్  ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు,పార్టీ సెక్రటరీ జనరల్ డా. కేశవరావు గారు, సభలోని మంత్రులు,ఎం .పి లు, ఎమ్మెల్సీలు, ఎం ఎల్ ఎలు, చైర్మన్లు ,  జడ్పీటీసీ లు పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారం..... ఈ రోజు మనకు రంజాన్ పండుగ రోజు కంటే తక్కువ కాదు. ఎందుకంటే ఈరోజు మా పార్టీకి 21వ సంవత్సరం పూర్తయిన రోజు.....  21 సంవత్సరాల క్రితం ఈ రోజునే మన మహానేత శ్రీ కేసీఆర్ గారు  టి ఆర్ ఎస్ పార్టీని స్థాపించారు. తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రజల హక్కుల సాధనే ఏకైక లక్ష్యం.  తెలంగాణ ప్రాంతం నిరంతరం నిర్లక్ష్యానికి గురైంది. ఇక తెలంగాణ ప్రజలను ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం చేశారు. తెలంగాణ సంపదను తెలంగాణ కాకుండా ఇతర ప్రాంతాలకు ఖర్చు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేంద్రంలోని పార్లమెంటరీ కమిటీ తెలంగాణలో ప...

టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సమావేశంలో దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టిఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించిన అనంతరం మంత్రి కేటీఆర్ ప్రసంగం

Image
 టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సమావేశంలో దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టిఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించిన అనంతరం మంత్రి కేటీఆర్ ప్రసంగం 60 లక్షల మంది తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుగుజాతి చరిత్రలో ఇద్దరు మహనీయులు రాజకీయాలను మలుపు తిప్పారు స్వర్గీయ నందమూరి తారక రామారావు చరిత్ర సృష్టిస్తే, మన కేసీఆర్ గారు చరిత్రతో పాటు...రాష్ట్రాన్ని సృష్టించారు ఇతర రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటే, రాష్ట్రాన్ని తేచ్చిన వారే మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలంగాణ ప్రజల ప్రత్యేక ఆకాంక్ష రాష్ట్రాన్ని సాధించి, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన కెసిఆర్ గారి జన్మ ధన్యమని అప్పటి స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ తెలిపారు నా జీవితంలో గొప్ప ఆందోళనకారులను గొప్ప పరిపాలకులను చూశాను కానీ ఒక ఆందోళన కారుణిగా, ఒక గొప్ప పరిపాలకునిగా ఉన్న వ్యక్తి కెసిఆర్ గారి అని  అరుణ్జైట్లీ అన్నారు ఈరోజు తెలంగాణ ఆచరిస్తున్నది, రేపు దేశం తప్పక ఆచరించాల్సిన పరిస్థితి వచ్చే గొప్ప స్థాయికి మనరాష్ట్రం చేరుకుంది 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో అనేక మంది పర...

టిఆర్ఎస్ పార్టీ 21 వ ఆవిర్భావ దినోత్సవంలో టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రసంగ పాఠం (27-04-2022)

Image
 టిఆర్ఎస్ పార్టీ 21 వ ఆవిర్భావ దినోత్సవంలో టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రసంగ పాఠం (27.04.2022) • నేడు 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని 22వ సంవత్సరంలోకి టిఆర్ఎస్ పార్టీ అడుగిడుతున్న సందర్భంలో మీ అందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు • 80 శాతం మంది పరిపాలనలో భాగస్వాములుగా ఉన్న ప్రజాప్రతినిధులతో, 60 లక్షల మంది పార్టీ సభ్యులతో, సుమారు 1000 కోట్ల ఆస్తులు, అస్సెట్స్ రూపంలో కలిగి ఉన్నటువంటి సంస్థగా అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్ర సాధన జరిపి, సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుతున్నటువంటి సమర సైనికులు, కాపలాదారుల పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ. • ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోట. ఎవరు కూడా బద్దలు కొట్టలేని కంచు కోట • టిఆర్ఎస్ పార్టీ ఏ వ్యక్తిదో, శక్తిదో కాదు యావత్ తెలంగాణ ప్రజల ఆస్తి • నిండైనటువంటి, మెండైనటువంటి శక్తితో అనుక్షణం తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేటువంటి కాపలాదారు టిఆర్ఎస్ పార్టీ. • రెండు దశాబ్దాల క్రితం ఏడుపు వస్తే కూడా ఎవరిని పట్టుకొని ఏడవాలో తెలియనటువంటి పరిస్థితి తెలంగాణ ...

భక్తులు చేయకూడని పనులు

Image
            భక్తులు చేయకూడని పనులు  1 . స్నానము చేయకుండా దేవతామూర్తిని తాకకూడదు  2 .   ఆశుచి గానుండు యు తాకరాదు( మల మూత్ర విసర్జన ) 3 . సాక్షాత్తు భోజనం చేసి  పాదోదక ము ను పుచ్చుకొనరాదు 4 .  నైవేద్యం లేకుండా పూజించరాదు 5.  ముట్టు తను(  బహిష్టు అయిన  శ్రీ చూసి) పూజించరాదు 6.  గంటను నేలమీద ఉంచరాదు 7.  దేవుడు ఉన్న స్థానము కంటే  ఎత్తయిన ఆసనమును మీద కూర్చుని పూజ చేయరాదు 8.  పుష్పములను నీటితో తడప రాదు 9. దేవుని ఎదుట గిరగిరా తిరిగి రాదు ఆత్మ ప్రదక్షణ యను నడిచే దేవుని    చుట్టు చేయవలెను గాని ఎదుట చేయరాదు 10.  దేవుని ఎదుట భోజనం చేయరాదు 11. భోజనం చేయక ఆకలితో నక నక లాడుచు పూజ చేయరాదు 12.  పూజ చేయునపుడు కం బలం కప్పు కొనరాదు 13.  దేవుని పూజ మందిరంలో ముందు కుడి కాలు పెట్టి వలెను ఎడమ కాలు పెట్టి వెళ్ళకూడదు 14 దేవుని దగ్గర ఉమ్మ వేయకూడదు 15 నైవేద్యము దైవ గురు ప్రసాద్ అని భావించ వలెను గాని కొబ్బరి పెసర పప్పు గారేలుఅని వర్ణించారు 16.  దేవుని విగ్రహమును దేవుడని భావించే వల్ల నేగాని...

తీర్మానం - 1 యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్రప్రభుత్వమే కొనుగోలుచేస్తున్నందుకు అభినందన తీర్మానం

 తీర్మానం - 1 యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా  రాష్ట్రప్రభుత్వమే కొనుగోలుచేస్తున్నందుకు అభినందన తీర్మానం వ్యవసాయిక దేశమైన భారతదేశాన్ని పరిపాలించే ఏ ప్రభుత్వమైనా రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతాపార్టీ ప్రభుత్వంమాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది. పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కొమ్ముగాస్తూ   వ్యవసాయాన్ని క్రమంగా  కార్పొరేట్ శక్తుల పరం  చేసేందుకు కుట్రలు చేస్తున్నది. కేంద్రం లోని బీజేపీప్రభుత్వం వ్యవసాయ రంగంలో గుణాత్మక మార్పుకు దారితీసే ఒక్క మంచి నిర్ణయం  తీసుకోలేదు. రైతు  సంక్షేమం కోసం కేంద్రం తానేమీ చేయకపోగా రాష్ట్ర ప్రభుత్వాలు  చేస్తున్న కృషికి విఘాతాలు సృష్టిస్తున్నది. ఇందుకు మన రాష్ట్రమే ఉదాహరణ  తెలంగాణా ప్రభుత్వం వ్యవసాయ పునరుజ్జీవనానికి గత ఎనిమిది సంవత్సరాలలో  ఎన్నో నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది. అపూర్వమైన ఫలితాలను సాధించింది. దేశం ఆశ్చర్యపోయే విధంగా వ్యవసాయ రంగంలో పురోగతిని సాధించింది. వరి ఉత్పత్తిలో నేడు తెలంగాణా రాష్ట్రం, దేశంలోనే అగ్రస్థానంలో న...